ఉప్పల్, వెలుగు: తనను గెలిపిస్తే.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం హబ్సిగూడ డివిజన్లోని గంగా జమున అపార్ట్మెంట్లో కార్పొరేటర్ కక్కినేని చైతన్య హరీశ్తో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత రామంతాపూర్ డివిజన్లోని బాలకృష్ణ నగర్, సాయి కృష్ణ నగర్ ఆర్టీసీ కాలనీల్లో కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ప్రచారం కొనసాగించారు.
మీర్పేట డివిజన్ హెచ్బీ కాలనీ, తిరుమల నగర్, మంగాపురం కాలనీ, ఇందిరానగర్, ఇందిరా నగర్ ఫేజ్2, వెంకటేశ్వర నగర్, కాలనీల్లో జనం నుంచి ఆయన స్పందన లభించింది. ప్రభాకర్ను గెలిపిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు.