గెలిపిస్తే.. గుండెల్లో పెట్టుకొని చూస్కుంట : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

గెలిపిస్తే.. గుండెల్లో పెట్టుకొని చూస్కుంట : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

 ఉప్పల్​, వెలుగు:  తనను గెలిపిస్తే.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం హబ్సిగూడ డివిజన్​లోని గంగా జమున అపార్ట్​మెంట్​లో  కార్పొరేటర్ కక్కినేని చైతన్య హరీశ్​తో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత రామంతాపూర్ డివిజన్​లోని బాలకృష్ణ నగర్, సాయి కృష్ణ నగర్  ఆర్టీసీ కాలనీల్లో కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ప్రచారం కొనసాగించారు. 

మీర్​పేట డివిజన్ హెచ్​బీ కాలనీ, తిరుమల నగర్, మంగాపురం కాలనీ, ఇందిరానగర్, ఇందిరా నగర్ ఫేజ్​2, వెంకటేశ్వర నగర్, కాలనీల్లో జనం నుంచి ఆయన స్పందన లభించింది. ప్రభాకర్​ను గెలిపిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..    తనను గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్​​ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు.