
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ తన సిరీస్ ఎ రౌండ్ నిధుల సేకరణను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రౌండ్లో మొత్తం రూ.100 కోట్లను సేకరించినట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో జనవరిలో రూ.50 కోట్లు, మేలో పొడిగించిన సిరీస్ ఏ రౌండ్లో అదనంగా రూ.50 కోట్లు ఉన్నాయి.
ఈ రౌండ్లో హీలియోస్ హోల్డింగ్స్, శారదా ఫ్యామిలీ ఆఫీస్, కే ఫ్యామిలీ, మరికొందరు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ నిధులను ఓబెన్ ఎలక్ట్రిక్ తన కార్యకలాపాలను విస్తరించడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, డీలర్షిప్ నెట్వర్క్ను విస్తరించడానికి కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అభివృద్ధి చేయడానికి వినియోగించనుంది.
2026 ఆర్థిక సంవత్సరం నాటికి 50కి పైగా నగరాల్లో 150కి పైగా షోరూమ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వరకే పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి కీలక మార్కెట్లలోకి ప్రవేశించింది.