మక్తల్, వెలుగు: ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్కు హాజరుకావాలని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజిహ్ను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. మంత్రి శనివారం భువనేశ్వర్వెళ్లి సెక్రటేరియెట్లో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంను శాలువాతో సత్కరించారు.
