ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసుల మృతి

ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసుల మృతి

ఒడిశా: ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్‌ పహార్ సమీపంలోని జాతీయ రహదారి-49పై వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పోలీసు వ్యానును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందగా మరో 17 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వ్యానులో మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.