
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఘటన
కరీంనగర్, వెలుగు: గ్రూప్1 ఎగ్జామ్ డ్యూటీలో ఉండగానే ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ బీరు తాగుతూ పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం గ్రూప్–1 ఎగ్జామ్ జరగ్గా ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా పర్వేజ్ బాధ్యతలు నిర్వహించాడు. అభ్యర్థులు పరీక్షా హాల్లోకి వెళ్లాక ఆయన బీరు తీసుకుని బస్టాండ్లో తాగుతూ కూర్చున్నాడు.
ఆయన మెడలో ఎగ్జామ్ డ్యూటీకి సంబంధించిన ట్యాగ్ ను గుర్తించిన పోలీసులు పీఎస్ కు తరలించారు. అనంతరం విచారించగా తన డ్యూటీ 10.30కే అయిపోయిందని తెలిపాడు. కాగా, పర్వేజ్కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా 170% రీడింగ్ చూపించింది.