- మూసాపేట్సర్కిల్ లో అధికారులు డీడీల గోల్మాల్
- కమిషనర్ లోకేశ్ కుమార్కు కార్పొరేటర్ల కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: బల్దియాలో ఇంటిదొంగలు తయారయ్యారు. కాంట్రాక్టర్లు పెట్టే సెక్యూరిటీ డిపాజిట్ డీడీలను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లు వర్క్ పూర్తి చేసిన తర్వాత అమౌంట్వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డీడీలను కార్పొరేషన్ ఖాతాలో డిపాజిట్ చేయకుండా.. కాంట్రాక్టర్లకు తిరిగి ఇవ్వకుండా మధ్యలో అధికారులు కాజేస్తున్నారు. ఈ డీడీలు కమిషనర్ పేరుతో ఉంటుండగా ఇదే ఛాన్స్ అనుకొని ప్రాపర్టీ ట్యాక్స్చెల్లిస్తున్న వారి నుంచి డబ్బులు తీసుకుంటూ ఇచ్చేస్తున్నారు. మళ్లీ వారి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసి డిపాజిట్లు చేస్తున్నట్లు బల్దియాకు లెక్కలు చూపుతున్నారు. ఒక్క మూసాపేట్ సర్కిల్లోనే దాదాపు కోటి రూపాయలకు పైగా డీడీలు గోల్ మాల్ అయినట్లు మూసాపేట్, మల్కాజిగిరి కార్పొరేటర్లు మహేందర్, శ్రావణ్ ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు కోవాలంటూ సోమవారం కమిషనర్ లోకేశ్ కుమార్ కు కార్పొరేటర్లు కంప్లయింట్ చేశారు.
కేటీఆర్ శాఖలోనే అవినీతి
కార్పొరేటర్లు మహేందర్, శ్రావణ్ మాట్లాడుతూ కొందరు అధికారుల అవినీతి వల్లే బల్దియా మరింత నష్టాల్లోకి వెళుతుందని ఆరోపించారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలా జరగదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ శాఖలోనే ఇలాంటి గోల్మాల్నడుస్తుందని విమర్శించారు. చర్యలు తీసుకోకపోతే స్టేట్ విజిలెన్స్ కు కంప్లయింట్ చేస్తామని చెప్పారు. కమిషనర్ దృష్టికి కూడా వచ్చినట్లు, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఓ సర్కిల్స్థాయిలో ఇంత అవినీతి జరుగుతుందంటే స్టేట్ లెవల్లో ఇంకెలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు. బల్దియాలోని అన్ని సర్కిళ్లలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకొని సంస్థను కావాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.