
స్టూడెంట్స్ అరెస్ట్
డిచ్పల్లి, వెలుగు : నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని క్యాంపస్లో కాకుండా ప్రైవేట్ హోటల్లో పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం స్టూడెంట్స్ వర్సిటీ గేట్లకు తాళం వేశారు. పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 15 మందిని అరెస్ట్ చేసి డిచ్పల్లి పీఎస్కు తరలించారు. స్టూడెంట్ లీడర్లు మాట్లాడుతూ కాన్ఫరెన్స్ వర్సిటీలో నిర్వహిస్తే స్టూడెంట్స్కి ఉపయోగపడేదని, కానీ..డబ్బుల కోసం వర్సిటీ ఆఫీసర్లు స్టార్ హోటల్ లో పెట్టారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై వీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.