జూనియర్ కాలేజీల అభివృద్ధికి సర్కార్ కృషి : దాసరి ఒడ్డెన్న

జూనియర్ కాలేజీల అభివృద్ధికి సర్కార్ కృషి :  దాసరి ఒడ్డెన్న

సదాశివనగర్, వెలుగు : జూనియర్​ కాలేజీల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్​ కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాలేజీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4 వేల మంది విద్యార్థులను చేర్పించాలని టార్గెట్ ఉండగా, ఇప్పటి వరకు 3350 మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు తెలిపారు. 

కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 16 లక్షలు మంజూరు చేసిందన్నారు.  అనంతరం మొక్కలు నాటారు.  కామారెడ్డి ఇంటర్ బోర్డు నోడల్​ అధికారి షేక్​ సలాం, ప్రిన్సిపాల్​ సింగం శ్రీనివాస్​, డివిజనల్​ లో ని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్​ ఎఖినొద్దీన్​, నారాయణ, యూసుఫ్, గంగారాం, శంకర్, నరేందర్, జ్యోతిర్మయి పాల్గొన్నారు.