
పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఫిక్స్ అయింది. అల్లు అర్జున్ హీరోగా, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా ఈ చిత్రం రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని టీ సిరీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటనపై సినీ ప్రియులు, ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్, నటులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.