
వేములవాడ, వెలుగు: దశాబ్దకాలంగా వేములవాడ పట్టణంలో పెండింగ్లో ఉన్న రోడ్ వెడల్పు పనులను ఆదివారం అధికారులు ప్రారంభించారు. పట్టణంలోని మటన్మార్కెట్ ఏరియాలోని మున్సిపల్దుకాణాలను జేసీబీలతో అధికారులు తొలగించారు. పోలీస్ లతో బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేశారు. తిప్పాపూర్బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్ వెడల్పు కోసం 80 ఫీట్స్గా నిర్ధారించారు. మొత్తం 260 మంది నిర్వాసితులకు గాను 70 మంది వరకు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అధికారులు నష్టపరిహారం చెక్కులను అందజేశారు.
రోడ్వెడల్పు కోసం రూ. 47 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బాధితులకు ఇల్లు ఖాళీ చేయాలని15 రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీచేశారు. 20 తేదీ వరకు కొంత మంది కోర్టుకి వెళ్లగా మిగతా ఇళ్లను అధికారులు తొలగించనున్నారు. 250 నుంచి 260 మంది నిర్వాసితులు ఉన్నారని, 322 స్ర్టక్చర్స్ ఉన్నాయని, నిర్వాసితులందరూ సహకరించాలని వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్కోరారు. వేములవాడ పట్టణంలో రోడ్ వెడల్పు కార్యక్రమం దృష్ట్యా పట్టణంలో రోడ్ వైడనింగ్ జరిగే ప్రదేశం నుండి 100 మీటర్ల దూరం వరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 144 సెక్షన్ ను అధికారులు అమలు చేశారు.