ప్రజావాణికి 1,588 ఫిర్యాదులు

ప్రజావాణికి 1,588  ఫిర్యాదులు

పంజగుట్ట,వెలుగు:  మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం ప్రజావాణికి అవుట్​సోర్సింగ్​స్టాఫ్​నర్సులు, టీఎస్​ఎస్​పీ కానిస్టేబుల్​అభ్యర్థులు, భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు ఇచ్చారు. బీఆర్ఎస్​పాలనలో తమకు అన్యాయం జరిగిందని, కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని కోరారు.  నోడల్​అధికారి దివ్య దేవరాజన్​ పర్యవేక్షణలో జరిగిన ప్రజావాణికి మొత్తం 1,588 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.