మహాముత్తారం/ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులు సూచించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వసతులు, భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, రిజిస్టర్లు, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. ఆహార మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్ చెంచు కాలనీలోని బాలికల ఆశ్రమ పాఠశాలను తహసీల్దార్ గిరిబాబు తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించిన ఆహార పదార్థాలను పరిశీలించారు.
