న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో సిబ్బంది రిహార్సల్స్ చేశారు. 73వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక బలగాల బృందం, సీనియర్ ఇండియన్ ఆర్మీతోపాటు పారామిలటరీ సిబ్బంది కలిసి ఉదయం 5 గంటల నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఒకవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరిగిన వేళ.. లెక్క చేయకుండా రిహార్సల్స్ చేశారు. కరోనా నిబంధనల మధ్య ఈసారి గణతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
మరిన్ని వార్తల కోసం: