ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

శాయంపేట, వెలుగు:  ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని హార్టికల్చర్ ఆఫీసర్​మధులిక అన్నారు. శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన రైతు మాడ బుచ్చిరెడ్డి ఆయిల్ పామ్ తోటలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రెండేళ్ల వయసున్న ఆయిల్ పామ్ మొక్కల చుట్టూ జనుము విత్తనాలు నాటుకొని, పూత దశలో భూమిలో కలిసేలా తౌటం పెట్టాలని సూచించారు.

 ఈ తోటలు సాగు చేస్తున్న రైతులకు డ్రిప్ ఏర్పాటుకు 90, మొక్కల కొనుగోలుకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో టన్నుకు రూ.21 వేల ధర ఉందని, రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారని చెప్పారు. ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, డ్రిప్​ ఇరిగేషన్ పరీక్షిత్ కంపనీ స్టేట్​ కో–ఆర్డినేటర్​ దేవేందర్ రెడ్డి, డ్రిప్​ఇరిగేషన్​ డీలర్ రవీందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.