డివైడర్‌ను ఢీకొట్టి కారు మీద పడ్డ ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

డివైడర్‌ను ఢీకొట్టి కారు మీద పడ్డ ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం రాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ వేలో నౌజీల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

యూపీ నుంచి ఆగ్రా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ట్యాంకర్ పక్కగా ఓ కారు వెళ్తుంది. అందులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. డివైడర్‌ను ఢీకొట్టిన ట్యాంకర్.. కంట్రోల్ తప్పి కారు మీద పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, అయిదుగురు పురుషులు స్పాట్‌లోనే చనిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

పింక్‌ టెస్ట్‌ పాసయ్యేదెవరు? నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్‌ డే/నైట్‌ మ్యాచ్​

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

సకల సౌకర్యాలతో మొతెరా అదుర్స్‌