న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎయిర్ పొల్యూషన్ఉన్న దేశాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరానికి సంబంధించిన స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్అనే సంస్థ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ నివేదికను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. దక్షిణాసియాలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
పాకిస్తాన్లో పీఎం2.5 (సూక్ష్మ ధూళి కణాలు) స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితుల కంటే సుమారు 13 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కాగా, యూపీలోని ‘లోని’ సిటీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఓవరాల్గా ఈ జాబితాలో ఇండియా ఆరో స్థానంలో ఉంది.
