ములుగు, వెలుగు: చలికి తట్టుకోలేక ములుగులో వృద్ధురాలు చనిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుకు చెందిన రాస రాధమ్మ(65) నిలువ నీడ లేకపోవడంతో ఆటోనగర్లోని అంగన్వాడీ సెంటర్ షెడ్డులో కొడుకు, మనవడితో కలిసి ఉంటోంది. చలి గాలులతో తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం చనిపోయింది. సొంత ఇల్లు లేకపోవడంతో కాలనీవాసులు రోడ్డు పక్కనే టెంట్ వేసి డెడ్బాడీని ఉంచారు. విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు.
