నిధుల‌న్ని టీఆర్ఎస్ నాయ‌కుల జేబుల్లోకే వెళ్లాయి

నిధుల‌న్ని టీఆర్ఎస్ నాయ‌కుల జేబుల్లోకే వెళ్లాయి

హైద‌రాబాద్‌: ఓల్డ్ బోయిన్ పల్లి ప్రజలు ప్రశ్నించే గొంతుకే ఓటు వేసి, గెలిపించాల‌ని అన్నారు ఆ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి దండుగుల అమూల్య. టీఆర్ఎస్ కార్పొరేటర్ వచ్చినప్పటి నుండి బోయిన్ పల్లి లో అభివృద్ధి కుంటుపడిందని.. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ల పేరుతో టీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయని ఆమె అన్నారు, అస్మత్ పేట్ చెరువు అభివృద్ధి కొరకు వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయి తప్ప దుర్గంధం మాత్రం పోలేదని అన్నారు. ప్రజా సమస్యలే మా మ్యానిఫెస్టో అని.,ప్రజల దగ్గరకే వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ 24 గంటలు ప్రజలల్లో ఉంటానని ఆమె అన్నారు. తనకు ఓటేసి గెలిస్తే అందరికీ అందుబాటులో ఉండి ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అమూల్య అన్నారు.