రెచ్చిపోయిన ఫోన్ స్నాచర్స్.. స్కూటీపై వచ్చి..

రెచ్చిపోయిన ఫోన్ స్నాచర్స్.. స్కూటీపై వచ్చి..

ఢిల్లీలో కొంతమంది దుండగులు దారుణానికి ఒడిగట్టారు. మొబైల్ ఫోన్ స్నాచింగ్ కోసం ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ అమానుష సంఘటన గురువారం సాయంత్రం షాలిమార్ బాగ్‌లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళ్తే.. స్థానికంగా నివసించే 38 ఏళ్ల మహిళ ఫోర్టిస్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి ఫోన్ లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన మహిళ  ప్రతిఘటించింది. దాంతో దుండగులు ఆమెను స్కూటీతో పాటు 150 మీటర్ల దూరం రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మహిళ ఫోన్ వదిలేయడంతో.. దుండగులు ఆమెను వదిలి ఫోన్ తో పరారయ్యారు. రోడ్డుపై పడిపోయిన మహిళను.. పాదాచారులు, వాహనదారులు కాపాడారు. చికిత్స నిమిత్తం ఆమె పనిచేస్తున్న ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

For More News..

మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్

బావిలో పడిన చిన్నారిని కాపాడిన రెస్క్యూ టీం