శ్రీదేవి 5వ వర్థంతి.. భర్త, కూతురు ఎమోషనల్ పోస్ట్

శ్రీదేవి 5వ వర్థంతి.. భర్త, కూతురు ఎమోషనల్ పోస్ట్

ఈ రోజు సినీ నటి శ్రీదేవి 5వ వర్థంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. శ్రీదేవిని ముమ్మా అని అభివర్ణించిన జాన్వీ కపూర్.. తాను చేసే ప్రతి పనిలోనూ తన తల్లి ఉందనుకుంటున్నానని, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా తన అది తల్లితోనే మొదలవుతుంది, ముగుస్తుందని రాసుకొచ్చారు. దాంతో పాటు శ్రీదేవితో దిగిన ఫొటోను జాన్వీ కపూర్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రెటీలు కామెంట్ చేస్తున్నారు.  తల్లిపై జాన్వీ కపూర్ పై ఉన్న ప్రేమను చూసి మెచ్చుకుంటున్నారు.

ఇక శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా ఆమెను గుర్తు చేసుకున్నారు. ఆమెకు సంబంధించిన ఓ అద్భుతమైన ఫొటోను ఆయన షేర్ చేశారు. శ్రీదేవి తమను వదిలి 5 సంవత్సరాలైనా.. తన ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయని బోనీ కపూర్ పోస్ట్ లో తెలిపారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మరణించారు.