రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద లారీ, భైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మోహమ్మద్ షరీఫ్ ,క్లీనర్ ఎండి ఆర్బాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాంగ్ రూట్ లో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు