- వైరస్పై పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూత
- వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న భర్త
న్యూఢిల్లీ: ‘కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. మీ కోసం, మీరు ప్రేమించే వాళ్ల సేఫ్టీ కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ తప్పకుండా పెట్టుకోండి’.. ఆస్పత్రి బెడ్ మీది నుంచి అతికష్టమ్మీద ఓ లేడీ డాక్టర్ వీడియో మెసేజ్ఇది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్.. కడుపులో బిడ్డ చనిపోతే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ మరుసటి రోజు కరోనా ఆ డాక్టర్ను బలితీసుకుంది. గత నెలలో ఢిల్లీలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన ఆ డాక్టర్ పేరు డింపుల్ అరోరా చావ్లా.ఆమెకు భర్త, మూడేళ్ల బాబు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్. ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్గా తేలడంతో డింపుల్ ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్17న బెడ్ మీది నుంచే ఈ వీడియో తీసి భర్త , బంధువులు, ఫ్రెండ్స్కు పంపించారు. అందరినీ హెచ్చరించారు. తర్వాత నాలుగు రోజులకు డింపుల్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం మొదలైంది. డాక్టర్లు రెండు సార్లు ప్లాస్మా థెరపీ కూడా చేశారు.. అయినా ఉపయోగం లేకుండా పోయింది. 25 న డాక్టర్లు సిజేరియన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. కరోనా వైరస్ వల్ల ఇబ్బందులకు తోడు బిడ్డ చనిపోవడంతో డింపుల్ తట్టుకోలేకపోయారు. ఆ మరుసటి రోజే కన్నుమూశారు. భార్య చివరి కోరిక, జనంలో అవగాహన కోసం డింపుల్ భర్త రావీశ్ ఈ వీడియో మెసేజ్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
I lost my pregnant wife and our unborn child to covid
— Ravish Chawla (@ravish_chawla) May 9, 2021
She breathed her last on 26/4/21 and our unborn child a day earlier. She got covid positive on 11/4 and even during her suffering she had made the above video on 17/4 warning others not to take this covid lightly. #CovidIndia pic.twitter.com/Syg6yddMTD