వెహికల్ ఢీకొని ఒకరి మృతి

వెహికల్ ఢీకొని ఒకరి మృతి

మాదాపూర్, వెలుగు :  వెహికల్ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జనంపేట గ్రామానికి చెందిన చుండ్రు రాజేందర్​(38) హైదరాబాద్‌‌లో ఇంటీరియర్​ డిజైనర్‌‌‌‌గా పని చేస్తున్నాడు. అయ్యప్ప సొసైటీ ఏరియాలో రూమ్ రెంట్​కు తీసుకొని ఉంటున్నాడు. 

ఆదివారం రాత్రి 11 గంటలకు మాదాపూర్​ నుంచి అయ్యప్ప సొసైటీలోని తన రూమ్​కు నడుచుకుంటూ వెళ్తున్న రాజేందర్​ను బాటా షోరూం వద్ద ఓ వెహికల్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్‌‌‌‌ను మాదాపూర్‌‌‌‌ పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.  అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ సోమవారం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాలకు రాజేందర్ మృతి చెందాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.