మాదాపూర్, వెలుగు : వెహికల్ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జనంపేట గ్రామానికి చెందిన చుండ్రు రాజేందర్(38) హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నాడు. అయ్యప్ప సొసైటీ ఏరియాలో రూమ్ రెంట్కు తీసుకొని ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి 11 గంటలకు మాదాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీలోని తన రూమ్కు నడుచుకుంటూ వెళ్తున్న రాజేందర్ను బాటా షోరూం వద్ద ఓ వెహికల్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్ను మాదాపూర్ పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ సోమవారం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాలకు రాజేందర్ మృతి చెందాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.