- రూ.15లక్షల జరిమానా
బెల్లంపల్లి, వెలుగు: చెక్బౌన్స్కేసులో బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్షతోపాటురూ.15 లక్షల జరిమానా విధిస్తు జూనియర్సివిల్ జడ్జి జె.ముకేశ్ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్రావు తెలిపారు. 2021లో కాల్టెక్స్కు చెందిన బంక కుమార్కు విజ్ఞాన్ రూ.12 లక్షల చెక్ఇవ్వగా అది బౌన్స్అయ్యింది. దీంతో ఆయన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన జడ్జి నేరం రుజువు కావడంతో విజ్ఞాన్ కు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చినట్లు తెలిపారు.
