ఆన్​లైన్​లో డబ్బులు తీసుకొని.. క్యాష్ ఇస్తానని మోసం..ముగ్గురు అరెస్ట్

ఆన్​లైన్​లో డబ్బులు తీసుకొని.. క్యాష్ ఇస్తానని మోసం..ముగ్గురు అరెస్ట్
  •  పేట్​బషీరాబాద్ పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: ఆన్​లైన్ ​ద్వారా డబ్బులు తీసుకుని క్యాష్​ రూపంలో ఇస్తానని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బెంగళూరుకు చెందిన మనీషా సావంత్,​ ఛత్తీస్ ఘడ్​కు చెందిన కుంజురామ్​పటేల్​వ్యాపార భాగస్వాములు. ఇటీవల కుంజురామ్​కు మనీషా సావంత్ ఆన్​లైన్​లో  రూ.18.5 లక్షలు చెల్లించింది. తిరిగి డబ్బుల గురించి అడగడంతో తన వద్ద నగదు ఉందని హైదరాబాద్​లో కలిసి ఇస్తానని నమ్మబలికాడు.

నగదు తీసుకోవడానికి పేట్​బషీరాబాద్​లోని ప్యాంటాలూమ్ షాప్​ వద్దకు రమ్మనాడు. అక్కడికి వచ్చిన ఆమెకు చిన్నపిల్లలు ఆడుకునే డబ్బులు ఇవ్వడంతో గమనించి ప్రశ్నించింది. దీంతో కుంజు రామ్​పటేల్​తోపాటు అతని వెంట ఉన్న ఇద్దరు పారిపోయారు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.