- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : యూరియా పంపిణీని సులభతరం చేసేందుకే ప్రభుత్వం ప్రత్యేక మొబైల్యాప్ను తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. యాప్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల కోసం షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఎరువులు తీసుకోవచ్చన్నారు. భూ విస్తీర్ణాన్ని బట్టి యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల సెటిల్మెంట్ కోసం ప్రచారం..
క్లయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. మీ డబ్బు మీ హక్కు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రచారం చేస్తామన్నారు. ఆన్క్లయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి నిధులను క్లయిమ్ చేసుకోవాలన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్, ఎన్డీసీసీ బ్యాంక్ జీఎం అనుపమ, ఎల్డీఎం చంద్రశేఖర్, కెనారా బ్యాంక్ డీఎం మనీష్ సైనీ, ఎస్ఎల్బీసీ ప్రతినిధి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ఆర్థిక సాయం
వివిధ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జిల్లా క్రీడాకారులకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం అందజేశారు. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన గోతి పరశురాం, కిన్నెర ఆనంద్, మాలవత్ ఈశ్వర్లకు రూ.25వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి సాధించిన విజయాలు జిల్లాలోని యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి జిల్లాలో మరింత శ్రద్ధ తీసుకుంటామన్నారు. జిల్లా క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ జైపాల్రెడ్డి, సెక్రటరీ అనిల్ పాల్గొన్నారు.
