జోగిపేట, వెలుగు: తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ అజయ్కుమార్ బుధవారం జోగిపేట 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 22 మంది డాక్టర్లకు గానూ ఐదుగురే డ్యూటీలో ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్టర్లో వారికి ఆబ్సెంట్ రాశారు. గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. హాస్పిటల్లోని వార్డులన్నీ తిరిగి చూశారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సూచించారు. మరోసారి ఇలా చేస్తే సీరియస్యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
