లాస్ ఏంజెల్స్: కరోనా లాక్ డౌన్ అన్ని వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా ఇండస్ట్రీపై ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు లేకుండా ప్రతి చిత్ర పరిశ్రమలోనూ షూటింగులు రద్దయ్యాయి. రిలీజ్ కు రెడీగా ఉన్న తమ సినిమాలను కొందరు నిర్మాతలు థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకోగా.. మరికొందరు ప్రొడ్యూసర్స్ తమ ఫిల్మ్స్ ను మంచి ధర పలికితే ఓటీటీ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కొత్త సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తప్ప థియేటర్లలో రిలీజే చేయలేని పరిస్థితి నెలకొంది. అన్ని సినీ పరిశ్రమలు మూతబడిన నేపథ్యంలో ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల కమిటీ ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్, సైన్సెస్’ కీలక డెసిషన్ తీసుకుంది. రానున్న 93వ ఆస్కార్ అవార్డుల (2021) అర్హతకు ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కరోనా కారణంగా తాత్కాలిక మినహాయింపును ఇస్తున్నామని చెప్పింది. సినిమాలు చేసే మ్యాజిక్ ను చూడటానికి థియేటర్లను మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని, దీనికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా అకాడమీ అవార్డ్స్ రూల్స్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇలా ‘టెంపరరీ ఎగ్జెంప్షన్’ ఇస్తున్నామని చెప్పింది. ‘అనిశ్చితి నెలకొన్న ఈ పరిస్థితుల్లో మెంబర్లతోపాటు కొలీగ్స్ కు అకాడమీ మద్దతుగా ఉంటుందది. వారి పనితీరును, అవసరాన్ని, ప్రాముఖ్యతను మేం గుర్తించాం. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఆడియన్స్ గతంలో కంటే ఎక్కువగా సినిమాలను అభినందిస్తున్నారు’ అని అకాడమీ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్, సీఈవో డాన్ హడ్సన్ ఓ ప్రకటనలో చెప్పారు. వాస్తవానికి 93వ అకాడమీ అవార్డ్స్ వేడుకకు థియేట్రికల్ రిలీజ్ చేసిన సినిమాలకు అవార్డును ప్లాన్ చేశారు. ప్రస్తుత తరుణంలో కమర్షియల్ స్ట్రీమింగ్ లేదా వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) సర్వీసు ద్వారా మాత్రమే కొత్త మూవీస్ రిలీజులు అందుబాటులో ఉండటంతో వాటిల్లో వచ్చిన సినిమాలనే బెస్ట్ పిక్చర్, జనరల్ ఎంట్రీతోపాటు స్పెషల్ కేటగిరీల్లో అర్హత ఇవ్వనున్నారు. అయితే స్ట్రీమింగ్ సైట్, వీవోడీలో 60 రోజుల పాటు స్ట్రీమ్ చేసిన మూవీస్ ను మాత్రమే అవార్డు అర్హతగా తీసుకోనున్నారు. అలాగే థియేటర్ల రీఓపెన్ తర్వాత అకాడమీ క్వాలిఫయింగ్ రిక్వైర్ మెంట్స్ ప్రకారం థియేటర్ రిలీజ్ మూవీస్ ను మాత్రమే అవార్డు ఎంపికలో అర్హతగా తీసుకోనున్నారు.
కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త విధానం
- టాకీస్
- April 29, 2020
మరిన్ని వార్తలు
-
NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?
-
Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?
-
Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్
-
Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్
లేటెస్ట్
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ
- RCB vs GT: బెంగళూరు - గుజరాత్ మ్యాచ్కు వర్షంముప్పు! రద్దయితే పరిస్థితి ఏంటి?
- బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు
- 25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఆఫ్గానిస్తాన్ రాయబారి
- టీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా
- Health Milk : ఏ వయస్సులో ఎన్ని పాలు తాగాలి.. రోజుకు ఎంత తాగాలి..?
- జాబు కావాలంటే బాబు రావాలి... గంజాయి కావాలంటే జగన్ ఉండాలి.. చంద్రబాబు
- Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?
- మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న