
Sam Altman: ప్రపంచంలో టెక్నాలజీ వినియోగాన్ని ఏఐ విప్లవాత్మకంగా మార్చేసింది. ప్రతి చిన్న అవసరాలను క్షణాల్లో వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇది సహాయంగా నిలుస్తోంది. అనేక డిజిటల్ సేవలను ప్రతిరోజూ ఏఐ టూల్స్ వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి.
అయితే ఈ క్రమంలో చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మెన్ కీలక కామెంట్స్ చేశారు. గతంలో ఆయన ఏఐ వినియోగానికి కొత్తగా హార్డ్ వేర్ మార్పులు అక్కర్లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఈ విషయంపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లు ఏఐ రూపకల్పనకు ముందున్న ప్రపంచ అవసరాల కోసం తీర్చిదిద్దబడ్డాయని.. అయితే ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఏఐ వినియోగం కోసం కొత్త డివైజ్లకు మారటం ముఖ్యమని అన్నారు.
►ALSO READ | వారెన్ బఫెట్ కీలక నిర్ణయం.. రూ.50వేల కోట్లు విలువైన షేర్లు విరాళం..
మారుతున్న ప్రపంచంలో ఏఐ కీలకంగా మారుతున్న వేళ ప్రజలు కొత్త ఏఐ కంప్యాటబుల్ కంప్యూటర్లు, డివైజ్ లకు మారాలని శామ్ పేర్కొన్నారు. దీని ద్వారా సాధారణంగా ప్రజలు ఉపయోగించే ట్రెడిషనల్ టైపింగ్, స్కీన్ విధానం నుంచి మారాల్సిన అవసరం ఉందన్నారు. రీసెర్చ్ ప్రకారం తర్వాతి తరం ఏఐ టెక్నాలజీలు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లపై రన్ చేయటం ఇబ్బందికరంగా మారుతుందని తేలింది. దీనికి అనుగుణంగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త కంప్యాక్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని వెల్లడైంది.