
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ను అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించిన అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్తో పోల్చుతూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ సిందూర్.. బిన్ లాడెన్ను చంపడంతో సమానమైందని వెల్లడించారు.
భారత్ సరిహద్దులను దాటి పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిందన్నారు. శనివారం ఆయన నోయిడాలో ఉన్న జైపూరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (జేఐఎమ్)లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ.." ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్.. అంతర్జాతీయ సరిహద్దులను దాటి ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది.
ఇది బిన్ లాడెన్ ను అంతమొందించిన అమెరికా ఆపరేషన్కు సమానమైన చర్య. ఈ ఆపరేషన్ ద్వారా టెర్రరిజంపై భారత్ తన కఠిన వైఖరిని చాటడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేసింది" అని ధన్ఖడ్ పేర్కొన్నారు.