ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే.. కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్​ సిందూర్​ విజయోత్సవ ర్యాలీలు

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే.. కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్​ సిందూర్​ విజయోత్సవ ర్యాలీలు

కామారెడ్డి టౌన్​/ బాల్కొండ/: ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ కావడంతో ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఉగ్రవాదులపై దాడి చేసి అంతమొందించడాన్ని స్వాగతిస్తూ పటాకులు కాల్చారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జై జవాన్​.. జై భారత్​ అంటూ నినదించారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీహెచ్​పీ  ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వీహెచ్​పీ జిల్లా ప్రెసిడెంట్ నిత్యానందం,  ప్రతినిధులు వడ్ల వెంకటస్వామి,  వంగ ప్రసాద్​, ఆశోక్​, అనిల్​,  రాజు తదితరుల పాల్గొన్నారు.

బాల్కొండ నేషనల్ హైవేపై కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జాతీయ జెండా చేతపట్టి నినాదాలు చేశారు. పహల్గాం మృతులకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​మండల ప్రెసిడెంట్ వెంకటేశ్​గౌడ్, లీడర్లు యూనిస్, కట్టెల శ్రీనివాస్, విద్యాసాగర్,శ్రీనివాస్, సంజీవ్ గౌడ్,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.  బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న -మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్​లోని పులాంగ్​ చౌరస్తాలోని అంబేద్కర్​ విగ్రహానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు పూలమాలలు వేసి జవాన్లు సెల్యూట్​ చేశారు. అనంతరం పటాకులు కాల్చి నినాదాలు చేశారు.