వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘మన రక్షణ కోసం బోర్డర్లో ఫైట్ చేసే వారియర్స్ గురించి తీసిన సినిమా గురించి మాట్లాడటం గర్వంగా ఉంది. పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్ లాంటి ఘటనలను కూడా ఇందులో చూపించారు.
శక్తి ప్రతాప్ సింగ్ చాలా రీసెర్చ్ చేసి ఈ కథను రాశాడు. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. ప్రతి ఒక్కరూ చూడాలి. రియల్ హీరోస్కు సెల్యూట్ చేసే సినిమా ఇది. డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వరుణ్ తేజ్ ప్రూవ్ చేసుంటున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగులో రాబోతున్న మొదటి చిత్రమిది. ఈ చిత్రం కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘జవాన్స్ త్యాగాలను, ధైర్య సాహసాలని చూపించే ప్రయత్నమే ఈ సినిమా. ప్రతి సైనికుడు 140 కోట్ల జనాన్ని తమ సొంత ఫ్యామిలీలా భావిస్తారు. అలాంటి కాన్సెప్ట్తో, గొప్ప ప్యాషన్తో డైరెక్టర్ శక్తి ఈ చిత్రాన్ని రూపొందించాడు'అని చెప్పాడు. వరుణ్ తేజ్ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ అని చెప్పాడు దర్శకుడు శక్తి ప్రతాప్. నిర్మాత సందీప్ మాట్లాడుతూ
‘ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు ట్రిబ్యూట్గా ఈ చిత్రాన్ని నిర్మించాం’ అని చెప్పాడు. నాగబాబు, దర్శకులు కరుణ కుమార్, సాగర్ కె చంద్ర, కృష్ణ చైతన్య, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, శశి సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. నటులు నవదీప్, అభినవ్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఎడిటర్ నవీన్ నూలి , లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.