ఉప్పల్ లో ఓపీఎం డ్రగ్స్​ ​పట్టివేత

ఉప్పల్ లో ఓపీఎం డ్రగ్స్​ ​పట్టివేత
  • మరో రెండు చోట్ల 28 కిలోల 
  • గంజాయి స్వాధీనం

ఉప్పల్/మెహిదీపట్నం/శామీర్​పేట, వెలుగు: ఉప్పల్ పీఎస్ పరిధి గణేశ్​నగర్ లో కిలో ఓపీఎం డ్రగ్స్ పట్టుకున్నారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ కి చెందిన బాదర్ రామ్ అలియాస్ బహదూర్ గుర్జర్(32 ) సిటీలో టైలర్. రాజస్థాన్ నుంచి లక్ష్మణ్ మాలిక్ అనే వ్యక్తి ద్వారా ఓపీఎం తీసుకువచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. 

మహేశ్వరం ఎస్ ఓటీ, ఉప్పల్ పోలీసులు నిఘా పెట్టి గణేశ్ నగర్ లో బాదర్​రామ్​ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కిలో ఓపీఎం విలువ రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. కార్వాన్‌‌ టోలీ మజీద్‌‌ ప్రాంతంలోని మహమ్మద్ సలీం ఖాన్‌‌, మహమ్మద్ ఇంతియాస్‌‌ ఖాన్‌‌, వంశీకృష్ణ, సోనూ కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నారు.

 శుక్రవారం దాడులు చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్, ధూల్​పేట ఎక్సైజ్ పోలీసులు  2.1కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్​చేశారు. మరో ఐదుగురు పరారైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, దూల్పేట్ ఎక్సైజ్  ఇన్స్పెక్టర్ మధు బాబు  తెలిపారు. 

మేడ్చల్ జిల్లా శామీర్ పేట పీఎస్​పరిధిలోని మజీద్ పూర్ లో ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న వారిని రైడ్​చేసి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా 26 కిలోల గంజాయి దొరికింది. ఆ టైంలో కారులో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉండగా అదుపులోకి తీసుకున్నారు.