ఒప్పో కంపెనీలో ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

ఒప్పో కంపెనీలో ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

నోయిడా : చైనాకు చెందిన ఒప్పో మెబైల్ సంస్థ గ్రేటర్ నోయిడా ప్లాంట్ కరోనా కలకలం మొదలైంది. సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీని మూసి వేశారు. వారి తో కలిసి పనిచేసిన వారందరినీ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. మార్చి 24 ప్రకటించిన లాక్ డౌన్ నాటి నుంచి ఒప్పో సంస్థ ఫ్యాక్టరీని మూసేసింది. ఇటీవల కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వటంతో మే 8 న మళ్లీ కంపెనీలో వర్క్ మొదలైంది. దాదాపు మూడు వేల మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఇటీవల ఉద్యోగులందరికీ టెస్ట్ లు చేశారు. వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఫ్యాక్టరీ మొత్తాన్ని డిస్ ఇన్ ఫెక్ట్ చేయనున్నారు.