న్యూఢిల్లీ: ఎన్నికల కౌంటింగ్ సమయంలో వీవీప్యాట్మెషిన్లను ముందు లెక్కించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు విపక్షాల నేతలు చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదు మెషిన్లలో పోలైన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చాలని, అందులో తేడాలుంటే ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ మెషిన్లను లెక్కించాలని కోరామన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. మూడు నాలుగేళ్లుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని కాంగ్రెస్పార్టీ సీనియర్నేత గులాం నబీ ఆజాద్చెప్పారు. తమ విజ్ఞప్తులపై ఈసీ నెలల తరబడి మౌనం వహించిందని అభిషేక్సింఘ్వి ఆరోపించారు. ఇప్పుడేమో బుధవారం సమావేశమై ఈ ఆరోపణలపై చర్చిస్తామని జవాబిచ్చిందన్నారు.
ప్రజా తీర్పును గౌరవించాలని, అందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశామని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్కు సంబంధించినంత వరకు ఈవీఎంల పనితీరులో గందరగోళం నెలకొందని, రాష్ట్రంలో భద్రత బలగాల సంఖ్యను పెంచాలని డిమాండ్చేశామని బీఎస్పీ నేత సతీశ్చంద్ర మిశ్రా చెప్పారు. ఈవీఎంల ట్రాన్స్పోర్ట్విషయంలోనూ ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే క్రమంలో గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ క్లబ్లో 22 ఎన్డీయేతర పక్షాల నేతలంతా సమావేశమయ్యారు. కాంగ్రెస్పార్టీ నుంచి అహ్మద్ పటేల్, ఆజాద్, అశోక్గెహ్లాట్, అభిషేక్సింఘ్వి, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, సతీష్మిశ్రా(బీఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), కేజ్రీవాల్(ఆప్), ఒబ్రెయిన్(టీఎంసీ), రాంగోపాల్యాదవ్(ఎస్పీ), కనిమొళి(డీఎంకే), మనోజ్ఝా(ఆర్జేడీ), మజీద్మెమన్(ఎన్సీపీ), దేవేందర్రాణా(ఎన్సీ) తదితరులు భేటీలో పాల్గొన్నారు.