
పంచాయతీరాజ్శాఖలో 311 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో జడ్పీ సీఈవో 23, డిప్యూటీ సీఈవో 23, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) 23, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (డీఎల్పీవో) 40, ఎంపీడీవో 10, మండల పంచాయతీ ఆఫీసర్ 101 పోస్టులు ఉన్నాయి. గత నెల, ఈ నెలలో 23 జిల్లా పరిషత్లు, వందకుపైగా మండల పరిషత్లు ఏర్పడ్డాయి. అయితే కొత్త పోస్టులు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో అధికారులకు తాత్కాలికంగా పదోన్నతులు ఇచ్చి కొత్త జడ్పీలు, మండల పరిషత్లలో నియమించారు. పంచాయతీరాజ్ శాఖలో పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశాలివ్వడంతో కొత్త పోస్టులను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈవోపీఆర్డీ (ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పీఆర్డీ) పోస్టును మండల పంచాయతీ ఆఫీసర్గా మార్చాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో అధికారులు మండల పంచాయతీ ఆఫీసర్గానే పోస్టులు మంజూరు చేశారు.