
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన మీడియా కంటెంట్ విభాగమైన జియో స్టూడియోస్ సొంతంగా సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్, మినీ -ఒరిజినల్స్ను నిర్మించనుంది. క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా ప్రసారం చేయడంతో ఈ యాప్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ కంటెంట్ను కూడా తేవాలని నిర్ణయించింది. యాప్ను పెయిడ్సర్వీసుగానూ మార్చుతామని సంస్థ వర్గాలు తెలిపాయి. జియో స్టూడియోస్, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్పురితోపాటు దక్షిణ భారత భాషల్లో సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్లు మినీ-ఒరిజినల్స్ను నిర్మించనుంది.