V6 News

సీపీఎస్ అమలు చేయాలి..ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు డిమాండ్

సీపీఎస్ అమలు చేయాలి..ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు డిమాండ్

ఓయూ, వెలుగు: సీపీఎస్ అమలు చేయాలని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు డిమాండ్​చేశారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్​భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. రిజిస్ట్రార్ నరేశ్​రెడ్డి, ఓఎస్డీ జితేందర్​కుమార్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందించారు. 20 ఏండ్లుగా సీపీఎస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.

 వీసీ ప్రొఫెసర్​కుమార్ చొరవ తీసుకొని అమలు చేయించాలని కోరారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్​శ్రీనివాసులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాశీం, యూజీసీ డీన్ లావణ్య, ప్రొఫెసర్లు మల్లేశం, వెంకటలక్ష్మి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.