పినాయిల్ తో ఆర్ట్స్ కాలేజీని కడిగిన ఓయూ జేఏసీ నేతలు

పినాయిల్ తో ఆర్ట్స్ కాలేజీని కడిగిన ఓయూ జేఏసీ నేతలు
  •     పినాయిల్ తో ఆర్ట్స్ కాలేజీ ముందు కడిగి పసుపు నీటితో శుద్ధి కార్యక్రమం

ఓయూ,వెలుగు : మాజీ సీఎం కేసీఆర్  బర్త్ డే  సందర్భంగా ఫొటోకు పాలాభిషేకం, కేక్ కట్ చేసి అపవిత్రం చేశారంటూ ఓయూ జేఏసీ నేతలు ఓయూ ఆర్ట్స్​కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. శనివారం జేఏసీ చైర్మన్​ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్స్​కాలేజీ ప్రాంగణాన్ని కడిగి పసుపు నీళ్లు చలి శుద్ధిచేశారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ.. పదేండ్లలో కేసీఆర్​ఒక్కసారి కూడా ఓయూకు వచ్చిన సందర్భం లేదని

నిరుద్యోగులకు జాబ్ లు  ఇచ్చిన సందర్భం లేదని పేర్కొన్నారు. ఓయూ నుంచి విద్యార్థి నేతలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశాలు వచ్చిన వాళ్లు కూడా ఓయూలోని సమస్యలపై  కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లలేదని విమర్శించారు. ఇలాంటి నేతలు ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద పుట్టినరోజు సంబరాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.