ఓయూ పీఎస్​లో స్టూడెంట్​ లీడర్ల ఫిర్యాదు

ఓయూ పీఎస్​లో స్టూడెంట్​ లీడర్ల ఫిర్యాదు

ఓయూ, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో తమకు ప్రాణహాని ఉందని, అతడి అనుచరులమంటూ తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పలువురు జేఏసీ నాయకులు ఓయూ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ ఉద్యమకారులందరికీ బెయిల్ ఇప్పించారని, వారిలో బాల్క సుమన్ కూడా ఉన్నాడని తాము ప్రెస్​క్లబ్​లో జరిగిన మీటింగ్​లో మాట్లాడామన్నారు.

దీంతో బాల్క సుమన్ అనుచరులు శశిపాల్ కొనాపురం, మరికొందరు తమకు ఫోన్ చేసి  బూతులు తిట్టారని ఓయూ స్టూడెంట్​సురేశ్​యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్క సుమన్​కు వ్యతిరేకంగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారన్నారు. ఫోన్ లో బెదిరింపుకు పాల్పడ్డ బాల్క సుమన్ అనుచరులైన టీఆర్ఎస్వీ నాయకులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్టూడెంట్​లీడర్లు నెహ్రూ నాయక్, రస వెంకట్ ముదిరాజ్, మేడి రమణ, ఆంజనేయులు  పాల్గొన్నారు.