వంద మిలియన్ టన్నుల బొగ్గు టార్గెట్ ...సింగరేణి సీఎండీ ఎన్. బలరాం

వంద మిలియన్ టన్నుల బొగ్గు టార్గెట్ ...సింగరేణి  సీఎండీ ఎన్. బలరాం
  • భవిష్యత్ లో మెరుగైన సంస్థగా తయారు చేద్దాం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో వంద మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ప్లాన్  రూపొందిస్తామని సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ డైరెక్టర్లు, సెలెక్టెడ్ జీఎంలు, మాజీ డైరెక్టర్లు, సీపీపీలు, జీఎంలతో కొత్తగూడెంలోని గెస్ట్​ హౌస్​లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడారు. సంస్థ భవిష్యత్ కు  మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. 

మార్కెట్​తో పోటీ పడాలంటే అధిక బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇతర రంగాల్లో విస్తరించే అంశాలపైనా చర్చించారు. కోల్​ప్రొడక్షన్​, సౌర, థర్మల్​ విద్యుత్​ఉత్పత్తి పై డైరెక్టర్​ఆపరేషన్స్​ఎల్​వీ సూర్యానారాయణ వివరించారు. 

ప్రోగ్రాం డైరెక్టర్​(పా) గౌతమ్​పొట్రు, డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, అడ్వైజర్​ మినిస్ట్రీ ఆఫ్​కోల్​ బి. వీరారెడ్డి, రిటైర్డ్​ డైరెక్టర్లు డీఎల్ఆర్​ప్రసాద్​, బి. రమేశ్​ కుమార్​, ఎ. మనోహర్​రావు, ఎ. భాస్కర్​ రావు, వి. బాల కోటిరెడ్డి, రిటైర్డ్​ జీఎంలు, అన్నిశాఖల జీఎంలు పాల్గొన్నారు.