
భారతదేశం అనేక రకాల వెరైటీ వంటకాలకు ప్రసిద్ధి. దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ కరాచీ బేకరీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలలో టేస్ట్ అట్లాస్ జాబితాలో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. టేస్ట్ అట్లాస్, ఆహార ప్రియుల కోసం విశిష్ట ట్రావెల్ గైడ్, కరాచీ బేకరీ ఫ్రూట్ బిస్కెట్లను ప్రపంచవ్యాప్తంగా 29వ అత్యుత్తమ డెజర్ట్గా ర్యాంక్ చేసింది. సిగ్నేచర్ ప్రొడక్ట్గా ఈ బిస్కెట్లకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా కరాచీ బేకరీ తెలిపింది. "ఈ బిస్కెట్లు సున్నితంగా రుచిగా ఉంటాయి, క్యాండీడ్ ఫ్రూట్తో నిండి ఉంటాయి" అని జోడించింది.
హైదరాబాద్లోని కరాచీ బేకరీ కాకుండా, మరో తొమ్మిది భారతీయ తినుబండారాలు సైతం టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించాయి. అవేంటంటే..
- కయానీ బేకరీ, పూణే (ర్యాంక్ 18)
- కెసి దాస్, కోల్కతా (25)
- ఫ్లూరీస్, కోల్కతా (26)
- బలరామ్ ముల్లిక్ & రాధారామన్ ముల్లిక్, కోల్కతా (37)
- కె రుస్తోమ్ & కో, ముంబై (49)
- కురేమల్స్ కుల్ఫీ, న్యూఢిల్లీ (67)
- ప్రకాష్ మషూర్ కుల్ఫీ, లక్నో (77)
- చితాలే బంధు, పూణే (85)
- జలేబీ వాలా, న్యూఢిల్లీ (93)
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ స్థలాల పూర్తి జాబితా టేస్ట్ అట్లాస్ అధికారిక వెబ్సైట్లో ఈ జాబితాను అందుబాటులో ఉంచింది.
హైదరాబాద్లోని కరాచీ బేకరీ
1953లో హైదరాబాద్లో స్థాపించిన ఈ కరాచీ బేకరీ, మొదట్లో తన బేకరీని మోజామ్ జాహీ మార్కెట్లో ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో సహా ఇతర భారతీయ నగరాలకు తన ఉనికిని విస్తరించింది. ప్రస్తుతం ఈ బేకరీ దాని ఉత్పత్తులను యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం లాంటి అనేక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.