
- వచ్చే నెల 8–10 మధ్య జరగనున్న ఈవెంట్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగబోయే ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ (ఐఈఎస్డబ్ల్యూ 2025)లో 200కి పైగా ఇండియన్ ప్యాసెంజర్ కార్ల తయారీ కంపెనీలు , ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీలు పాల్గొంటాయని ఈవెంట్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ 11వ ఎడిషన్ ఐఈఎస్డబ్ల్యూని వచ్చే నెల 8-–10 మధ్య న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తుంది. ఇండియాను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చాలనేదే ఈ ఈవెంట్ లక్ష్యం.
ఇండియా ఈవీ మార్కెట్..
ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ (ఈ3డబ్ల్యూ) మార్కెట్లో ప్రపంచంలోనే టాప్లో ఇండియా ఉంది. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (ఈ2డబ్ల్యూ) మార్కెట్లో కూడా కీలకంగా మారింది. దీనికి పీఎల్ఐ ఆటో, పీఎల్ఐ ఏసీసీ, ఫేమ్, పీఎం ఈ-–డ్రైవ్ వంటి గవర్నమెంట్ పాలసీలు బాగా సాయపడ్డాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ పాలసీలు ఈవీ డిమాండ్, సప్లయ్ని పెంచాయని, దేశంలో ఈవీ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేశాయని వివరించారు. ఐఈఎస్డబ్ల్యూలో 150 కి పైగా కీ పార్టనర్లు, ఎగ్జిబిటర్లు, వెయ్యికి పైగా విదేశీ కంపెనీలు (ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఫిన్లాండ్, కెనడా, యూఎస్ఏ, ఇజ్రాయెల్, సౌత్ కొరియా) పాల్గొంటాయి.