
తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సమీపంలోని మిలిటరీ బేస్ లక్ష్యంగా రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. రష్యా సరిహద్దు నుంచి 50 కిలో మీటర్ల దూరంలోని ఓఖ్ టిర్కా నగరంలోని మిలిటరీ బేస్ క్యాంపుపై సోమవారం మధ్యాహ్నం క్షిపణి దాడి చేసింది రష్యా సైన్యం. ఈ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మిలిటరీ యూనిట్ ధ్వంసమవ్వగా.. ఆ శిథిలాల కింద సైనికుల మృతదేహాల వెలికితీసినట్లు తెలిపాయి మీడియా ఏజెన్సీలు.
మరిన్ని వార్తల కోసం:
అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది
నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం
నాలుగు రోజులుగా బంకర్ లోనే..