తమిళనాడులో కూడా రాత్రిపూట కర్ఫ్యూ.. ఆదివారం లాక్ డౌన్

తమిళనాడులో కూడా రాత్రిపూట కర్ఫ్యూ.. ఆదివారం లాక్ డౌన్

చెన్నై: కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కూడా కఠిన ఆంక్షల బాట పట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆదివారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ప్రతి రోజు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. అలాగే శనివారం రాత్రి10 నుంచి సోమవారం ఉదయం వరకు అంటే ఆదివారం మొత్తం పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. మిగతా రోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.