
షాద్ నగర్, వెలుగు: షాద్నగర్లో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు విజిట్ చేశారు. నిర్మాణ ఖర్చుల్లో 80 శాతం నిధులు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భరిస్తుండడంతో మంత్రి అభినందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నుంచి తోడ్పాటునందిస్తామని చెప్పారు.