ఎస్బీఐ బ్యాంకులో.. అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎద్దు

 ఎస్బీఐ బ్యాంకులో.. అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎద్దు

నార్త్ ఇండియాలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఎస్బీఐ బ్యాంకులోకి ఎద్దు ప్రవేశించింది. దీంతో బ్యాంకులోని స్టాఫ్ అంతా భయబ్రాంతులకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ పట్టణంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఒక్కసారిగా ఎద్దు ప్రవేశించింది. దీంతో అంతా కంగారు పడి ఎక్కడి పని అక్కడ వదిలేసి బయటకు పరుగులు తీశారు. 

కొద్ది సేపు ఆ ఎద్దు బ్యాంక్ లో అలాగే నిల్చొని చూస్తూ ఉండిపోయింది. ఎద్దు తమని ఏమైనా చేస్తుందేమో అని అంతా కలవరానికి గురయ్యారు. కాని ఎద్దు ఎవ్వరికి ఎలాంటి హామీ తలపెట్టలేదు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఎద్దును బయటకు తరిమేశారు. బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకులో తక్కువ మంది ఉండటం వల్ల మంచిదైందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

 
ఎద్దు బ్యాంక్ లోపలికి వచ్చిన వీడియోను కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇందకేముంది క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది.  ఎద్దుకు ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చిందని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.