OTTలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులకి మైండ్ పోవడం ఖాయం

OTTలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులకి మైండ్ పోవడం ఖాయం

ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. అది కూడా సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ అంటే తెగ ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఆ జానర్ లో సిరీస్ లు వస్తున్నాయంటే ఎగబడి మరీ చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి మరో వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది. అదే పాతాల్ లోక్(Pathal lok ). థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఒళ్ళు  గగుర్పొడిచేలా ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 

నిజానికి ఈ సిరీస్ 2020లోనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఆ టైం ఈ సిరీస్ ఒక సంచలనం. ఒక్కో సీన్. ఒక్కో షాట్ ప్రేక్షకులను మైండ్ పోయేలా చేసింది. ఇక మధ్యలో వచ్చే ట్విస్టులకి పిచ్చెక్కిపోవడం ఖాయం. ఊహకందని స్క్రీన్ ప్లేతో దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆధ్యంతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. నిజానికి చాలా కాలంగా పాతాళ్ లోక్ సిరీస్ కోసం తెలుగు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ సిరీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్. మరి హిందీ బెల్ట్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సిరీస్ తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. హాతీరామ్ చౌదరి(జైదీప్ అహ్లావత్).. 20 ఏల్ల అనుభవం గల ఇన్ స్పెక్టర్. అతని చేతికి ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా(నీరజ్ కాబి) హత్య కేసు వస్తుంది. కెరీర్ లో మొదటి హైప్రొఫైల్ కేసు కావడంతో.. తన సబార్డినేట్ అన్సారీ(ఇష్వక్ సింగ్)తో కలిసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. దాని వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుసుకుంటాడు. ఆ హత్యా ఎవరు, ఎందుకు చేశారు? మధ్యలో CBI ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది? కేసు చివరకు ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

Also Read : రాజమౌళి సినిమా కోసం మహేష్ సిద్ధం.. వైరల్ అవుతున్న కొత్త లుక్