షింజో అబే రాజీనామా నన్ను బాధించింది: మోడీ

షింజో అబే రాజీనామా నన్ను బాధించింది: మోడీ

న్యూఢిల్లీ: జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. అబే రాజీనామాపై భారత ప్రధాని మోడీ స్పందించారు. అబేతో తన అనుబంధం గురించి మోడీ గుర్తు చేసుకున్నారు. అబే రాజీనామా తనను బాధకు గురి చేసిందని మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతమవ్వడానికి కృషి చేశారని మెచ్చుకున్నారు.

‘మీ అనారోగ్యం గురించి వినడం బాధ కలిగించింది. నా ప్రియ మిత్రమా.. గత కొన్నేళ్లలో మీ నాయకత్వ పటిమ, వ్యక్తిగత నిబద్ధతతో ఇంతకుముందు కంటే ఇండియా–జపాన్ భాగస్వామ్యం చాలా బలపడింది. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు.