టీ20లో భారత్‭ను ఓడించాలంటూ పాక్ నటి వ్యాఖ్యలు

టీ20లో భారత్‭ను ఓడించాలంటూ పాక్ నటి వ్యాఖ్యలు

టీ20 మ్యాచ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన  పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్ కప్‭లో భాగంగా నవంబర్ 6న ఇండియా, జింబాబ్వే తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‭లో భారత్‭ను జింబాబ్వే ఓడిస్తే.. ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సెహర్ షిన్వారీ వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. 

అయితే.. గతంలో కూడా ఈమె భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద వార్తల్లో నిలిచారు. బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్‌ చేసింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినపుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది. ఈమె చేసిన ట్వీట్ల పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఆమె చేసిన ట్వీట్‭ను డిలీట్ చేసి ఇండియా జట్టుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.